బిఆర్ఎస్ కు భారీ షాక్

బిఆర్ఎస్ కు భారీ షాక్
  • పార్టీ వీడిన నిర్మల్ మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్
  • కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం?

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఇటీవలి ఎన్నికల అనంతరం పార్టీ నుండి ఒకరు ఒకరే వీడుతూ వచ్చారు. తాజాగా మునిసిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కూడా మరో పదిమంది కౌన్సిలర్ తో సహా భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు కేసిఆర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.