బీఆర్ఎస్ కు గట్టి షాక్ - ఒకేసారి 70 మందికి పైగా రాజీనామాలు

బీఆర్ఎస్ కు గట్టి షాక్ - ఒకేసారి 70 మందికి పైగా రాజీనామాలు
  • బీఆర్ఎస్ ను వీడుతున్న ప్రజాప్రతినిధులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో బి ఆర్ ఎస్ ఖాళీ అవుతూనే ఉంది. నిర్మల్ మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్ సహా 12 మంది కౌన్సిలర్లు శనివారం పార్టీని వీడారు. కాగా తాజాగా ఆదివారం నిర్మల్ మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు భారత రాష్ట్ర సమితిని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి కి రాజీనామా పత్రాలను అందజేశారు. తాము త్వరలోనే డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు సమక్షంలో రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు వెల్లడించారు.