నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి..

నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో మొట్టమొదటి నామినేషన్ శుక్రవారం ఉదయం 11:19నిమిషాలకు బీజేపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా చందుపట్ల కీర్తీరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, పాపయ్య, యుగేందర్, గణపతి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.