కామారెడ్డి లో కాషాయ జండా ఎగరవేస్తాం
- ప్రతి ఒక్కరికీ స్పష్ఠమైన నిర్ణయానికి వచ్చారు
- మళ్ళీ ఉప ఎన్నిక తెచ్చుకోవాల్సిన అవసరం కామారెడ్డి ప్రజలకు లేదు
- బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి లో కాషాయ జండా ఎగరవేస్తామని బిజెపి కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణం 2వ వార్డు పరిధిలోని అడ్లుర్ గ్రామానికి చెందిన 108 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ లో చేరారు.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డికి పొలిటికల్ టూరిస్టులు ఆయారాం గాయారాం వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ కామారెడ్డి ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరనీ అన్నారు. ఓటు హక్కు వినియోగం విషయంలో ప్రతి ఒక్కరూ స్పష్ఠమైన నిర్ణయానికి వచ్చారనీ అన్నారు. మళ్ళీ ఉప ఎన్నిక తెచ్చుకోవాల్సిన అవసరం కామారెడ్డి ప్రజలకు లేదనీ అన్నారు. కామారెడ్డిలో కాషాయ జండా ఎగరవెస్తామని ధీమా వ్యక్తం చేశారు.