నోట్ బుక్స్ పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

నోట్ బుక్స్ పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని పిచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఈటెల రాజేందర్  పుట్టిన రోజు సందర్భంగా ఉప సర్పంచ్ మహేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు విద్యార్థులకు నోట్ బుక్స్ ప్లేట్స్ పెన్నులు పంపిణీ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి( జెఎస్ఆర్) సూచనలతో పంపిణీ చేయడం జరిగిందని ఉప సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈటెల ఈటల రాజేందర్ దని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, ప్రశాంత్, రాజయ్య, ఉదయ్, సతీష్, పరశురాములు, నర్సింలు, రాజిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు