జనగామలో ఉద్రిక్తత

  • పెంబర్తి మీదుగా బండి సంజయ్‌ తరలింపు
  • అడ్డుకున్న బీజేపీ లీడర్లు
  • లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు

ముద్ర ప్రతినిధి, జనగామ : కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్‌పై బీజేపీ లీడర్లు భగ్గుమన్నారు. బుధవారం ఉదయం జనగామ జిల్లాలోని పెంబర్తి వద్ద సీఎం కేసీఆర్‌‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అదే సమయంలో బండి సంజయ్‌ను పోలీసులు వరంగల్‌ తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న లీడర్లు అక్కడే వేచి ఉండి అడ్డుకున్నారు. కేసీఆర్‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు, బీజేపీ లీడర్లు మధ్య కొంత సేపు తోపులాట జరగడంతో ప్రాంత మంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో రెచ్చిపోయిన పోలీసులు బీజేపీ లీడర్లపై లాఠీచార్జ్‌ చేసిన చెదరగొట్టి సంజయ్‌ను వరంగల్‌కు తరలించారు.