21న జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలి - వీరమల్ల హరిగోపాల్

21న జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలి - వీరమల్ల హరిగోపాల్

ముద్ర, లక్షేట్టిపేట: పట్టణంలో ఈ నెల 21న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని బీజెపి పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరి గోపాల్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షేట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో 9 ఏళ్ళ మోడీ పాలన, సంక్షేమ పథకాల గురించి వివరించడానికి, 9 ఏళ్ల తెరాస పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియచేసేందుకు మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లక్షేట్టిపెట్ పట్టణానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

పట్టణంలోని స్థానిక బీజేపీ శ్రేణులతో పాటు, చుట్టు పక్కల గల లక్షేట్టిపేట, దండేపల్లి, హజీపూర్ మండల బీజేపీ శ్రేణులు, బీజేపీ అభిమానులు, మోడీ అభిమానులు, బండి సంజయ్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఇట్టి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బుద్దె లక్ష్మణ్, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్,  ముస్కాన్ గంగన్న,  శివశంకర్, పైడిపాల రమేష్ ,మోట పలుకుల సతీష్ , గోలిముణి ప్రసాద్, పాంచాల రమేష్,తదితరులు పాల్గొన్నారు.