ఇందారంలో యువకుని దారుణ హత్య

ఇందారంలో యువకుని దారుణ హత్య

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం మహేష్ అనే యువకుణ్ణి దారుణంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహేష్ ను కొంత మంది మహిళలు, పురుషులు అతకాయించి బండ రాళ్లతో కొట్టి చంపారు. ఓ వివాహితకు సెల్ లో అసభ్యకర మెసేజులు పెడుతూ వేధింపులకు గురిచేయడంతో వివాహిత తరపు వారు హత్య చేశారు. వీధిలో స్థానికులు అందరూ చూస్తుండగానే హత్య జరిగింది. ఎవరు అడ్డుకోవడానికి సాహసించలేదు. ఘటనా స్థలంకు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జైపూర్ పోలీస్ లు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.