మోడీ దిష్టిబొమ్మ దహనం

మోడీ దిష్టిబొమ్మ దహనం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు. శనివారం ఐబీ చౌరస్తాలో సమావేశమైన కాంగ్రెస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడుగా అనర్హత వేటు వేయడం కాకుండా కోర్టుకు వెళ్లిన రాహుల్ కు అక్కడా న్యాయం జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేధింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు కొండా చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి ,పట్టణ అధ్యక్షుడు నరేష్, కౌన్సిలర్లు మజీద్, బానేశ్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, నేతలు తదితరులు పాల్గొన్నారు.