రామకృష్ణాపూర్, ముద్ర : పట్టణంలోని ఆర్కే వన్ ఏ మార్కెట్ ఏరియాలోనీ ఓ రేషన్ డీలర్ పై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. గురువారం సదరు రేషన్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా మూడున్నర క్వింటాళ్ల రేషన్ బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు బ్రహ్మరావు తెలిపారు.