ప్రోఫెసర్ హరగోపాల్ పై కేసులు ఎత్తివేత డిజిపికి సిఎం కేసీఆర్ ఆదేశం
![ప్రోఫెసర్ హరగోపాల్ పై కేసులు ఎత్తివేత డిజిపికి సిఎం కేసీఆర్ ఆదేశం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_648d6da6925e7.jpg)
మొత్తం 152మందిపై ఉపా చట్టం కింద కేసులు. కేసులు ఎత్తివేత ప్రజాస్వామ్య విజయం : ప్రజా సంఘాలు, మేధావులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రోఫెసర్ హరగోపాల్ సహా 152పై ఉపా చట్టం కింద పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలి డిజిపిని సిఎం కేసీఆర్ ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరగోపాల్, విమలక్క సహా మొత్తం 152 మంది ప్రజా సంఘాల నేతలపై కేసులు నమోదు చేశారు. దీనిపై ప్రజాసంఘాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కేసులు ఎత్తివేయాలని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. ప్రజాసంఘాలను కట్టడి చేయడానికే గతంలో ప్రభుత్వం ఈ కేసులను నమోదు చేసిటన్లు తెలిసింది. కేసులు ఎత్తివేత ప్రజాస్వామ్య విజయమని పలువురు మేధావులు, ప్రజాసంఘాల నేతలు వ్యాఖ్యానించారు.