మునుగోడులో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం.. బిజెపిలో 70 కుటుంబాలు చేరిక - చలమల్ల కృష్ణారెడ్డి

మునుగోడులో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం.. బిజెపిలో 70 కుటుంబాలు చేరిక - చలమల్ల కృష్ణారెడ్డి

చండూరు, ముద్ర: మునుగోడులో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని బిజెపి రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో మునుగోడు మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 70 కుటుంబాలుబిజెపిలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నన్ను మోసం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని,  కాంగ్రెస్ పార్టీ కోసంఅన్ని గ్రామాలు తిరిగి, ప్రచారం పూర్తి చేశానని,ప్రజలలో నాకున్న ప్రజాదరణ చూడలేక నన్ను మోసం చేశారని వారు అన్నారు. ఈ మునుగోడు  ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ లోని కుటుంబ పాలన కొనసాగుతుందని వారు ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రాంతంలో అన్ని గ్రామాల ప్రజలు నా వెంటే ఉన్నారని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా  నన్ను గెలిపించడం కోసం అందరూ కృషి చేస్తారనివారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సురిగి నరసింహ గౌడ్, బొమ్మ గోని అనిల్ గౌడ్ చలమల టీం సభ్యులు నజీర్ బాబా, నరేష్, రాజారాం, రాజ్యలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.