రాజమండ్రి జైలుకు బాబు

రాజమండ్రి జైలుకు బాబు

14 రోజుల సీఐడీ జ్యుడీషియల్​ కస్టడి

ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ

ముద్ర,తెలంగాణ బ్యూరో : స్కిల్​ డెవలప్​మెంట్​ స్కాం కేసులు ఆరోపణలు ఎదుర్కొంటొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్​ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదివారం రాత్రి తీర్పు ఇచ్చింది. ఈ నెల 22వ తేది వరకు సీఐడీ జ్యూడిషియల్​ కస్టడీకి అప్పగించింది. కోర్టు అనుమతితో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. ఎలాంటి ప్రాజెక్టు రిపోర్ట్​ లేకుండానే సీమెన్స్​ ఇచ్చిన డీపీఆర్​ ఆధారంగా రూ. 3.281 కోట్ల బడ్జెట్​ ను కేబినెట్​ ముందు ఉంచిన చంద్రబాబు 90శాతం ఖర్చు సీమెన్స్​ భరిస్తుందని కేబినెట్​ కు అబద్దాలు చెప్పారన్న సీఐడీ వాదనాలతో ఏకీభవించింది.

ఎలాంటి పర్​ ఫామెన్స్​ గ్యారెంట్​, బ్యాంకు గ్యారంటీలు లేకుండానే ప్రభుత్వం రూ. 371 కోట్లను డిజైన్​ టెక్​ కు ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. నిధులు విడుదల చేసే సమయంలోనూ డిజైన్​ టెక్​ సరఫరా చేసే మిషన్ల నాణ్యతను పరీక్షించాలని ఆర్ధికశాఖ కార్యదర్శి సునిత నోట్​ ఫైల్​ లో రాశారనీ అయినా చంద్రబాబు ఆదేశాలతో పలు షెల్​ కంపెనీల ద్వారా డిజైన్​ టెక్​ కంపెనీ రూ. 279 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని గుర్తించింది. దీంతో గత రెండ్రోజులుగా నరాలు తెగే ఉత్కంఠకు తెరపడినట్లయింది.