జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : చంద్రబాబు ఆగ్రహం

జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీలో   టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడినిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడిని ఖండించారు. ఓ ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిచేయటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ జరగలేదని..సీఎం జగన్ ప్రోద్బలంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ మరచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజాయాన్ని తట్టుకోలేని ఇలా అసెంబ్లీలోనే జగన్ తన ఎమ్మెల్యేలతో తోటి ఎమ్మెలలపై దాడులు చేయించటానికి కూడా దిగజారారు అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉండే ఇది శాసనసభ కాదు కౌరవ సభ.. అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి అనాగరిక చర్యలతో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని..చట్టసభలకు మచ్చ తెచ్చిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు అంటూ విమర్శించారు.