నేడు పోలవరానికి సీఎం చంద్రబాబు..
![నేడు పోలవరానికి సీఎం చంద్రబాబు..](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_666fe8bca29d7.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం బయల్దేరారు. గత ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి సీఎం హోదాలో ఆయన పోలవరంలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి పోలవరం బయలుదేరిన సీఎం.. ప్రాజెక్టు నిర్మాణం స్టేటస్ ను స్వయంగా పరిశీలించనున్నారు.అలాగే అధికారులు, ఇంజనీర్లతో సమావేశమై ప్రాజెక్ట్ స్థితిగతులపై పాయింట్ టు, పాయింట్ చెక్ చేయనున్నారు. అలాగే ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం ప్రాజెక్ట్ ను పరిశీలించిన తర్వాత అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జెట్ స్పీడ్ లో ప్రాజెక్టు నిర్మాణ పూర్తవ్వాలని ఇప్పటికే అధికారులకు ఇంజనీర్లకు సూచించిన సీఎం.