చిరుత పిల్లల కలకలం

చిరుత పిల్లల కలకలం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి లో చిరుత పులి పిల్లతో సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఒక పిల్లను చిరుత తీసుకు వెళ్తుండగా తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న ఓ రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడ ఉన్న ఆ చిరుత పిల్లను చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. చిరుత పిల్లతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి వచ్చి, ఆ చిరుత పిల్లను కరీంనగర్ తరలిస్తామని వెల్లడించారు.