ఎట్టకేలకు చిక్కిన చిరుత

తిరుమలలో చిన్నారి లక్షితను చంపిన చిరుత బోనులో చిక్కింది. తిరుమలలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు దాడి జరిగిన ప్రాంతంలో బోను ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపేసిన చిరుతపులి బోనుకు చిక్కింది.