కలెక్టర్  బీఆరెస్ భవనాలను పూర్తి చేయాలి

కలెక్టర్  బీఆరెస్ భవనాలను పూర్తి చేయాలి
  • కలెక్టర్  బీఆరెస్ భవనాలను పూర్తి చేయాలి
  • ఆదేశించిన ప్రభుత్వ విప్ సుమన్
  • సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : 
జిల్లా కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ భవనాల సముదాయం, బీఆరెస్ జిల్లా పార్టీ కార్యాలయం పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, బీఆరెస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశించారు. బుధవారం బీఆరెస్, కలెక్టర్ కార్యాలయాల భవనాలను సుమన్ పరిశీలించారు. ఈనెల 29వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భవనాల ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. భవన నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలని సూచించారు. మంచిర్యాల శివారులోని తోళ్లవాగు సమీపంలో దగ్గర, దగ్గరలోనే కలెక్టరేట్, బీఆరెస్ భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అధికారికంగా ఖరారు కావలసి ఉంది. ముఖ్యమంత్రి పర్యటన ఎప్పుడు ఉన్నా ప్రారంభోత్సవం కు భవనాలు సిద్ధంగా ఉండాలని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం కలెక్టర్ సంతోష్ బనావత్ , ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు వెళ్లి కలెక్టర్ కార్యాలయం భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను వీక్షించారు.