నేరాల నియంత్రణకు కమ్యూనిటి కాంటాక్ట్. డీఎస్పీ రవీందర్ రెడ్డి 

నేరాల నియంత్రణకు కమ్యూనిటి కాంటాక్ట్. డీఎస్పీ రవీందర్ రెడ్డి 
  • 41 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం 

మెట్‌పల్లి ముద్ర:- జగిత్యాల జిల్లా ఎస్పి ఎగ్గడి భాస్కర్ ఆదేశానుసారం మెట్‌పల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకలవ్య నగర్ కాలనీలో డీఎస్పీ రవీందర్ రెడ్డి  ఆధ్వర్యంలో సిఐ లక్ష్మి నారాయణ, ఎస్సైలు శ్యామ్ రాజ్, మన్మధరావు, ఉమ సాగర్,నవీన్ కుమార్, చిరంజీవి, కిరణ్ కుమార్ 30 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌తో మంగళవారం ఆకస్మికంగా కమ్యూనిటి కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహించారు. కాలనీవాసులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సిఈఐఆర్ మొదలైన వాటి గురించి అవగాహన కల్పించారు.నెంబర్ ప్లేట్ లేని, పత్రాలు సరిగ్గా లేని 41 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని తెలిపారు. నేరాల నిర్మూలన కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం కల్పించడం పోలీసుల కర్తవ్యం అని, ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందన్నారు. అనుమానిత వ్యక్తులు కాలనీలో సంచరిస్తే, ఎవరైనా గంజాయి విక్రయించిన సేవించిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యుషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలింగిచే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. కాలనీలలో, స్వీయ రక్షణ కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భదత్ర పరమైన అంశాలలో సిసి కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాలు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.