మంచిర్యాల డిపోలో బస్సు ఢీకొని కండక్టర్ మృతి

మంచిర్యాల డిపోలో బస్సు ఢీకొని కండక్టర్ మృతి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్ డిపో వద్ద ప్రమాదవశత్తూ బస్సు ఢీ కొనడంతో అదిలాబాద్ డిపో కు చెందిన గంగారాం అనే కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం సెక్యూరిటీ కార్యాలయం వద్ద వాటర్ బాటిల్ లో నీళ్లు నింపుకుని బస్సు వద్దకు వెళ్తున్న క్రమంలో మంచిర్యాల డిపోకు  చెందిన బస్సు ముందు ఎడమ వైపు భాగం ఢీకొట్టింది. ధీంతో కింద పడ్డ గంగారాం పై నుంచి బస్సు వెళ్లడంతో ఆయన ఘటనాస్థలంలోనే తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు ఘటనాస్థలంకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం భౌతిక దేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కండక్టర్ మృతి పట్ల సహచర కండక్టర్ లు, డ్రైవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.