పేద ప్రజలకు పరం పోగు భూముల పట్టలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ

పేద ప్రజలకు పరం పోగు భూముల పట్టలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ

ముద్ర.వీపనగండ్ల: భూమిలేని నిరుపేద ప్రజలకు పరం పోగుభూమి పట్టాలి ఇచ్చి, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ నని మాజీ మంత్రి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధిలోని బొల్లారం గ్రామంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి సోనియమ్మ రుణం తీర్చుకుందాం అన్నారు. ఆనాడు బొల్లారం గ్రామంలో భూమి లేని పేద వాడికి పరం పోగు భూమి పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కూడా మంజూరు చేశానని,కెసిఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూం కూడా మంజరు కాలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని విమర్శించారు.తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను జూపల్లి గ్రామ ప్రజలకు వివరించారు.కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలకు  పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ ఓబీసీ కో ఆర్డినేటర్ డా. కేతూరి వెంకటేష్, వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, నాయకులు ఏత్తం కృష్ణయ్య, నారాయణరెడ్డి,సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.