భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి.. కాంగ్రెస్ నేతల సంబరాలు 

భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి..  కాంగ్రెస్ నేతల సంబరాలు 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా మంచిర్యాల లో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి , బానాసంచాలు కాల్చి ఆనందం పంచుకున్నారు.  బోథ్ నియోజకవర్గం పిప్పిరిలో మొదలైన పాదయాత్ర శనివారం నాటికి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని కాంగ్రెస్ నేతలన్నారు.  భట్టి విక్రమార్క పాదయాత్ర లో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలో నిర్వహించే సభకు జిల్లా నుంచి తరలి వెళ్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొండ చంద్రశేఖర్,  పట్టణ అధ్యక్షుడు నరేష్, బ్లాస్క్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కౌన్సిలర్ బానేశ్, మస్జి కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత తదితరులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేసి సంబరాలు పంచుకుంటున్న నేతలు