రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

 ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల:  మంచిర్యాల జిల్లా హజీపూర్ లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాసమల్ల అశోక్ గౌడ్ దుర్మరణం చెందాడు. హజీపూర్ లోని నివాసంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి భారీ వాహనం ఢీకొట్టడంతో అశోక్ గౌడ్ తీవ్రగాయాలతో మృత్యువాత పడ్డారు. ఈమేరకు హజీపూర్ పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ గౌడ్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ గౌడ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.