రాజీవ్ గాంధీ కి కాంగ్రెస్ నివాళులు

రాజీవ్ గాంధీ కి కాంగ్రెస్ నివాళులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట రాజీవ్ గాంధీ చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నేతలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 18 ఏండ్లు వయసు వచ్చిన వారికి ఓటు హక్కు కలిగించడం, కంప్యూటర్ వ్యవస్థ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లాంటి భవిష్యత్తు కార్యక్రమాలు అమలు చేసి దేశాన్ని పురోగమనం వైపు పయనించేలా కృషి చేశారని గుర్తు చేశారు.