కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు పర్వం

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు పర్వం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి  సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన నాయకులు  కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

ఈ సందర్భంగా  మనోహర్ రెడ్డి  వారికి కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తాండూర్ నియోజకవర్గంలోని కోటిపల్లి మండలానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు చేరిన వారిలో కోటిపల్లి మండలం సర్పంచ్ నక్కల విజయ లక్ష్మి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానంద ఉప సర్పంచ్ రియాజ్ ఉద్దీన్ వార్డ్ మెంబెర్స్ రమేష్ కుమార్, మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపిటిసిలు,మాజీ వార్డ్ మెంబెర్స్ సుమారు 2000 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ
తొడలు కొట్టే వారిని తాండూర్ నియోజక వర్గ ప్రజలు మెడలు వంచి పంపిస్తారు అన్నారు.మార్పు కోసం కలిసికట్టుగా పోరాడుదాం ఒక్క  అవకాశం ఇవ్వండి మీకు రుణపడి ఉంటా గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలకుల ముఖం చూసి ప్రజలు విసిగిపోయారని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారంటే తండోపతండాలుగా వస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అన్నారు.

కెసిఆర్ పాలనలో దగా, అవినీతి, కుటుంబ రాజకీయాలు చేస్తూ కుంభకోణాలు, నిరుద్యోగులను మోసం చేస్తుందని అన్నారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దత్తు గా నిలబడి, నియంతృత్వ నిరంకుశ పాలనకు గద్దె దించాలని అన్నారు. తాండూర్ కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఅర్ఎస్ పార్టీకి భయం పుట్టుకుందని, కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు.  అయిదేండ్లలో తాండూర్ లో ఏమి అభివృద్ది‌ చేశారో అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలన్నారు. ఇప్పటికే కారుకు ఆల్రెడీ టైర్లలో గాలి పోయిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీ పథకాలు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యమన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి సిలిండర్ రూ. 400 ఇస్తామని చెప్పడం వారి బీఆర్ఎస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం అబద్ధమేనని ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడని విమర్శించారు.తాండూర్  మార్పుతో పాటు కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని అభ్యర్తించారు.