మంచిర్యాల లో మొసలి కలకలం

మంచిర్యాల లో మొసలి కలకలం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లో మొసలి కనిపించడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది. గోదావరి సమీపంలోని కట్టే మిషన్ల సమీపంలోని నీటి మడుగులో  మొసలి ఆవాసాం ఏర్పాటు చేసుకుంది. సోమవారం ఉదయం నీటి మడుగు నుంచి బయటకు వచ్చిన మొసలి ఒడ్డున ఉన్న కొంగను ఆహారంగా పట్టుకోవడానికి చూస్తుండగా మొసలిని చూసిన కొంగ గాలిలోకి ఎగిరి పారిపోయింది. ఈ దృశ్యాన్ని కర్ర సామిల్ వైపు వెళ్లిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయ్యింది. గత వర్షాకాలం లో గోదావరి నదికి వరదలు రావడంతో ఎక్కడి నుండో నీటిలో కొట్టుకు వచ్చిన మొసలి సామీళ్ళ సమీపంలో ఉన్న నీటి మడుగులో ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.