విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి నేటితో గడువు ముగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి నేటితో గడువు ముగుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్ వేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు బిడ్లు వేసిన 22 కంపెనీలు. ఈ కంపెనీల్లో 6 విదేశీ, 16 స్వదేశీ కంపెనీలు. సింగరేణి సంస్థ బిడ్ వేస్తుందా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్. ప్రైవేటు కంపెనీలను అనుమతించవద్దంటున్న కార్మిక సంఘాలు. ప్రభుత్వ సంస్థలే విశాఖ స్టీల్ కొనుగోలు చేయాలని విజ్ఙప్తి చేస్తున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్–3ని రన్నింగ్లో పెట్టడానికి ఆర్ఐఎన్ఎల్ ప్రయత్నాలు చేస్తోంది. ముడి పదార్థాలు ఇస్తే స్టీల్ ఇస్తామని ప్రకటన. రూ. 5 వేల కోట్ల మూలధనం సమకూర్చే కంపెనీలకు ఆహ్వానం. ముడి పదార్థాలు ఇస్తామని, మూలధనం సమకూరుస్తామని బిడ్లు వేసిన 22 కంపెనీలు. రోలింగ్ మిల్స్ ఇవ్వాలని పలు కంపెనీల విజ్ఞప్తి చేస్తున్నాయి. రోలింగ్ మిల్స్ ఇవ్వొద్దని కార్మిక సంఘాలు అంటున్నాయి.