బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి, వామపక్ష లౌకిక శక్తులను బలపరచాలి - బండ శ్రీశైలం

బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి, వామపక్ష లౌకిక శక్తులను బలపరచాలి - బండ శ్రీశైలం

చండూరు, ముద్ర: ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వామపక్షాలను మోసం చేసిందని, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకుఓటు వేయాలని, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలోసిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం నాయకులు కంచర్ల రవి అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలోదళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తల తప్ప  అర్హులైన నిరుపేదలకు అందలేదనివారు ఆవేదన వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల ముందు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలుఇస్తామని హామీ ఇచ్చి,ఇంతవరకు అమలు చేయలేదనివారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లోకమ్యూనిస్టుల మద్దతు లేకుండాబిఆర్ ఎస్ గెలిచేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటిన అర్హులైన నిరుపేదలకు,  కొత్తగా పెండ్లీలు అయినా పేదలకు ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు కూడా ఇవ్వలేదని వారు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, హఠాత్తుగా కేవలం  అధికార ప్రభుత్వం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామనడం హస్యోస్పదంగా ఉందన్నారు.ఉప ఎన్నికల ముందుప్రజలకు అనేక హామీలు ఇచ్చి,అమలు చేయలేదనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శిమోగుదాల వెంకటేశం, చండూరు మండలసహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,,కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.