కెేసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే చిరుమర్తి

కెేసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే చిరుమర్తి

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: కెసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, వివిధ పార్టీలకు చెందిన 50 మంది ఆదివారం నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అభివృద్ధి బాటలు నడుస్తుంది అంటే సీఎం కేసీఆర్ చొరువుతోనే జరిగిందన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో 12 కు 12 బిఆర్ఎస్ ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాయన్నారు. బీఆర్ఎస్ గెలుపుతో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.