ఏబీవీపీ నాయకుల ధర్నా
చైతన్య కార్పొరేట్ పాఠశాల ఎదుట ఎబివిపి ధర్నా
ముద్ర, ప్రతినిధి జగిత్యాల: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులలో కుడా పాఠశాల నడిపి నడిపిస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తరగతులను అడ్డుకొని విద్యార్థులను ఇంటికి పంపించేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు రాపాక సాయికుమార్ మాట్లాడుతూ చైతన్య కార్పొరేట్ పాఠశాల వేసవి సెలవులు అయినా కొన్ని రోజుల నుండి పాఠశాల నడిపిస్తూ, విద్యార్థులను మానసిక ఇబ్బందికి గురిచేస్తుందిదని అన్నారు.
చైతన్య పాఠశాలకు ఫైర్ సేఫ్టీ పార్కింగ్ గ్రౌండ్ లేవువని అయినప్పటికీ పర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు
విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ పాఠశాల మీద అనేకసార్లు డీఈఓ కి ఫిర్యాదు చేసిన పట్టించకపోకపోవడం చాలా బాధాకరమని,డి ఇ ఒ పాఠశాలతో కుమ్మక్కయ్యార అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి అన్నారు .చైతన్య యజమాన్యం శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకుల పైన దుర్భాషలాడడం సరికాదు అన్నారు, . పాఠశాలలు పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి మండల విద్య అధికారులుప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలను తని