డిసెంబర్ 5 వరకు ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కర్ణన్

డిసెంబర్ 5 వరకు ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కర్ణన్

ముద్ర ప్రతినిధి, నల్గొండ: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నియమావాలి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5 తర్వాత యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు.