పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.1.70 లక్షల విరాళం

పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.1.70 లక్షల విరాళం

సారంగాపూర్ ముద్ర: సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ ఆలయ నిర్మాణానికి దాతలు రూ.170 లక్షలు ఆర్ధిక సహాయం అందించినట్లు  ఆలయ నిర్మాణ కమిటి సభ్యుడు పంపర్థి రంజిత్ తెలిపారు. ఇందులో బాగంగా గడ్డం   మైపాల్ రెడ్డి వనజ దంపతులు  రూ. 50 వేలు అలాగే దుబ్బ రాజన్న ఆలయ కమిటీ ధర్మకర్త భూతగడ్డ రమేష్  రూ.50 వేలు,  గంగాధరి నారాయణ గౌడ్ ఆలయ నిర్మాణానికి గాను తన వంతుగా రూ. 20వేల  నగదును , విశ్వబ్రాహ్మణ సంఘం వారు సైతం తమ వంతుగా 50వేల రూపాయలను విరాళం అందజేసినట్టు రంజిత్ తెలిపారు. ఈ సదర్భంగా దాతలను గ్రామస్థులు అభినందించారు.  ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రంజిత్ కోరారు. ఐదువేల రూపాయల పైన విరాళం అందించే దాదాల పేర్లు ఆలయ ఆవరణలో శిలాఫలకం పైన పేర్లు చెక్కించబడునని  తెలిపారు.