మృతుల కుటుంబాలకు దుబ్బాక ఎమ్మెల్యే పరామర్శ
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చనిపోయిన వారి కుటుంబాలను శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. బుధవారం రోజున దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట లో బుస్స ప్రవీణ్ తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను రఘునందన్ రావు పరామర్శించారు. దుబ్బాక పట్టణానికి చెందిన గొరిటాల ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేశారు. దుబ్బాక లో పాతూరి చిన్న లచ్చి రెడ్డి తండ్రి వెంకటరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.