భూకంపం ధాటికి ఊగిపోయిన మెట్రోరైల్

ముద్ర,సెంట్రల్ డెస్క్:-తైవాన్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపం వల్ల నలుగురు వ్యక్తులు మరణించారు. 57 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్లు US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంప సమయంలో మెట్రో ట్రైన్‌ అటూ ఇటూ ఊగిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు పెట్టారు. పలు భారీ భవంతులు కూలిపోయాయి. విద్యుత్ లేకపోవడంతో 87,000 మంది అంధకారంలో ఉన్నారు.