మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించిన ఉద్యోగులు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించిన ఉద్యోగులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రాష్ట్ర క్రీడలు, ఎక్సయిజ్ శాఖా మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. బుధవారం మంచిర్యాల లోని శ్రీనివాస గార్డెన్ లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు మంత్రిని సత్కరించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, టీటీసీఎఫ్సీ చైర్మన్ రవి కుమార్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.