పదోవ తరగతి పరీక్షా కేంద్రాల్లో భద్రత పెంచండి- పోలీస్ లను ఆదేశించిన రామగుండం సీపీ రాజేశ్వరి

పదోవ తరగతి పరీక్షా కేంద్రాల్లో భద్రత పెంచండి-  పోలీస్ లను ఆదేశించిన రామగుండం సీపీ రాజేశ్వరి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ భద్రతను పెంచి పరీక్షలు సజావుగా జరిగేలా పోలీస్ లు చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ.రేమ రాజేశ్వరి ఆదేశించారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాలు బహిర్గతం అయిన నేపథ్యంలో గురువారం మంచిర్యాల జిల్లా పోలీస్ లకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ లు తీసుకువెళ్ళకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాలు, వెలుపల వీధుల్లో ఉన్న అధికారులు ఎవరికి సెల్ ఫోన్ అనుమతించ వద్దని ఆమె ఆదేశించారు. పరీక్షా కేంద్రం వంద మీటర్ల వరకు ఎవరిని అనుమతించవద్దని సూచించారు. 144 సెక్షన్ అమలు చేస్తూ చుట్టు పక్కల జిరాక్స్ సెంటర్ లు మూసివేయించాలని ఆదేశించారు.