కూసుకుంట్ల గెలుపుకై విస్తృత ప్రచారం

కూసుకుంట్ల గెలుపుకై విస్తృత ప్రచారం

చండూరు,  ముద్ర: చండూరు మండల వ్యాప్తంగాకస్తాల, నేర్మట,బంగారిగడ్డ, తుమ్మలపల్లి పలు గ్రామాలలోవిస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామంలో  బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న పాల్గొన్నారు.సందర్భంగా వారు మాట్లాడుతూ,రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయనివారు ధీమా వ్యక్తం చేశారు. కూసుకుంట్ల గెలుపునుఎవరు ఆపలేరని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలనివారు అన్నారు. .పలు గ్రామాలలోఇంటింటికి తిరుగుతూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ ఉపాధ్యక్షులు కురుపాటి సుదర్శన్, మండల పార్టీ మాజీ  అధ్యక్షులు పెద్ద గోని వెంకన్న, నేర్మట గ్రామ శాఖ అధ్యక్షులు నారపాక శంకర్, నేర్మట సర్పంచ్ నందికొండ నరసింహారెడ్డి, కస్తాల గ్రామ మాజీ గ్రామ సర్పంచ్ బొమ్మరబోయిన వెంకటేశం, చిట్టిబాబు,తుమ్మలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడులక్ష్మణ్, బొమ్మర బోయిన స్వామి, ఆకారపు వంశీ  తదితరులు పాల్గొన్నారు.