రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
  • కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎఐసిసి జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ లో చేరిన జడ్పిటిసిలు వెంకట్ రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, మైనార్టీ నేత జమృత్ ఖాన్

షాద్‌నగర్, ముద్ర : షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం నిజామాబాద్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ప్రస్తుత టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఫరూఖ్ నగర్  జెడ్పిటిసి పి.వెంకట్ రాంరెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, మైనార్టీ నేత జమృత్ ఖాన్, వైయస్సార్ టిపి రాష్ట్ర నాయకురాలు ఆదూరి రమాదేవి,షాద్‌నగర్  మున్సిపల్ కౌన్సిలర్ శ్రావణి, మధురాపురం సర్పంచ్ శివారెడ్డి, రంగంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మధురాపురం ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, ఇప్పలపల్లి ఎంపిటిసి మంజుల రాజశేఖర్, వేముల నర్వ సర్పంచ్ మంజుల మల్లేష్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.