అమ్మవారి సన్నిధిలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

అమ్మవారి సన్నిధిలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

బాసర, ముద్ర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారిని సోమవారం ఉదయం  సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి మనవరాలు శ్రీ నిత్య కు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు.

ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చరిత్రను వివరించి , తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట భైంసా జడ్జి దేవేందర్ బాబు, అడ్వకేట్ రవీందర్ సింగ్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఈఓ విజయ రామారావు, భైంసా ఏ ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సీఐ వినోద్ రెడ్డి ఎస్సై గణేష్ ఉన్నారు.