కాంగ్రెస్ ఓబీసీ మండల అధ్యక్షుడిగా గండి నారాయణ..

కాంగ్రెస్ ఓబీసీ మండల అధ్యక్షుడిగా గండి నారాయణ..

ముద్ర,రుద్రoగి: కాంగ్రెస్  పార్టీ రుద్రంగి మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన  గండి నారాయణను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ కుస రవీందర్ ఒక ప్రకటన విడుదల చేశారు..ఈ సందర్భంగా గండి నారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం నుంచి తన నియామకానికి సహకరించిన ఓబీసీ సెల్ చైర్మన్ కుస రవీందర్ కు,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అది శ్రీనివాస్ కు ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.. కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు...రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు..అనంతరం మండల నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉప అధ్యక్షుడు తర్రె మనోహర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,నాయకులు ఎర్రం గంగానర్సయ్య,గడ్డం శ్రీనివాస్, ధ్యావల రవి,పూటకాపు మహిపాల్ రెడ్డి,గట్ల ప్రకాష్,మాడిశెట్టి అభిలాశ్ ,కట్కూరి దాసు , దయ్యాల శ్రీనివాస్,రిక్కల బుమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు..