బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం..

బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం..

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోకలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలిక ఆచూకీ లభ్యం కావడం తో పొలీసులు,బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసుల సహకారంతో కిడ్నాపర్ నుండి బాలికను కాపాడి ఘట్ కేసర్ కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఘట్ కేసర్ లోని ఈ డ బ్ల్యు ఎస్ కాలనీకి చెందిన భరత్, రాజేశ్వరి ల కూతురు కృష్ణవేణి (4) నీ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో సురేష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. సీ సీ టీవీ పుటేజీల ఆధారం గా పొలీసులు రాత్రి నుండి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. కిడ్నాప్ కు సంభందించిన పూర్తి వివరాలు మరి కొన్ని గంటల లో పోలీసులు వెల్లడించనున్నారు.