ఉపాధి కూలీలకు గిఫ్ట్​- మంత్రి ఎర్రబెల్లి

ఉపాధి కూలీలకు గిఫ్ట్​- మంత్రి ఎర్రబెల్లి
  • ప్రభుత్వం తరపున త్వరలో తట్ట, పార, గడ్డపార
  • ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, బ్యాగ్
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున త్వరలో గిఫ్ట్​ ఇస్తున్నామని మంత్రి దయాకర్​రావు వరంగల్​ జిల్లాలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూలీలకు తట్ట, గడ్డపార, పార వంటి పనిముట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున ఉపాధి హామీ కూలీలకు స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, ఆయా వస్తువులను తీసుకెళ్ళే విధంగా ఓ మంచి బ్యాగు ని పంపిణీ చేస్తామన్నారు. వరంగల్​ జిల్లా రాయపర్తి మండలం ఘటికల్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి పారపట్టి మట్టి తవ్వారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి పనులకు సంబంధించిన ఆయా పనిముట్లు, వస్తువులను పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. గతంలో ఉపాధి హామీ కింద మట్టి తవ్వకాల పనులు మాత్రమే చేపట్టే వారని, ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేసి ఆయా పనులను ఉపయోగంలోకి తెచ్చిందని చెప్పారు