జీపీ కార్మికుల అర్థనగ్న దీక్ష

జీపీ కార్మికుల అర్థనగ్న దీక్ష

కేసముద్రం ముద్ర: వేతన పెంపు, ఉద్యోగ క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో గ్రామపంచాయతీ కార్మికులు అర్ధనగ్న దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు మంగీలాల్ మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంధసిరి వెంకటేశ్వర్లు, అనిల్, నాగయ్య, శ్రీనివాస్, వెంకన్న, యాకయ్య, ప్రభాకర్, యాకమ్మ, లింగమ్మ, లలిత, కవిత పాల్గొన్నారు.