గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మె..      

గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మె..      

ముద్ర, వెంకటాపురం(నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్మికులు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో సిఐటియు మండల కార్యదర్శి కట్ల నర్సింహాచారి గురువారం సమ్మెను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె లో పాల్గొన్నారని, పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, పియఫ్, ఇయస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సిఐటియు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు రంజిత్, జనగాం  శ్రీను, లక్ష్మణరావు, తాటి శ్రీను, అనూష, రాంప్రసాద్, మోహన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.