ఘనంగా దుర్గాదేవి జాతర

ఘనంగా దుర్గాదేవి జాతర
  • పాల్గొన్న ప్రముఖులు
  • పోటెత్తిన భక్తులు
  • జన సంద్రంగా మారిన వనం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని ఏసీసీ క్వారీలో దుర్గాదేవి వనదేవత జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాఢమాసం లో క్వారీ జాతర వైభవంగా జరుగుతుంది. మంచిర్యాల పరిసర ప్రాంతాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో క్వారీకి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు బారులు తీరారు. వాహన యజమానులు ఆలయం ముందు ప్రత్యేక పూజలు చేసి జంతువులను బలిచ్చి మొక్కుబడులు తీర్చారు. అమ్మ వారి దర్శనం అనంతరం వన భోజనాలు చేశారు. క్వారీ అడవిలో చెట్ల కింద ఎక్కడ చూసిన వన భోజనాల కు వచ్చిన వారితో నిండిపోయాయి. క్వారీ పైన భక్తులతో కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా మంచిర్యాల, హజీపూర్, రామకృష్ణాపూర్ పోలీస్ లు బందోబస్తు నిర్వహించారు. కొంత మంది హడావుడి చేశారు.

అమ్మవారి దర్శనం చెంత ప్రముఖులు

క్వారీలోని దుర్వాదేవి అమ్మవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కేవీ ప్రతాప్, బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.