జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

ముద్ర ప్రతినిధి , కోదాడ:- జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చెయ్యాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆహార  మరియు పౌరసరఫరాలు , నీటిపారుదల శాఖామాత్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు టిడబ్ల్యూజే (ఐజేయు) ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల అప్పిరెడ్డి, దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షుడు బాదే రాము ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు . ఈ కార్యక్రమంలో అలుగూరి  హరినాథ్, లంకెల దశరధ రెడ్డి , దాచేపల్లి సతీష , నరేందర్ , ఆవుల మల్లికార్జున్ మేకపోతుల వెంకటేశ్వర్లు, జూలూరు వీరభద్రం, కోట రాంబాబు, పగడాల వాసు , చలిగంటి దామోదర్, లావుడియా రమేష్ , చారు గుండ్ల అజయ్ , షేక్ షంషుద్దీన్ , పల్లపు శ్రీనివాస్, గంధం రాము , చలిగంటి నాగరాజు, వెలిశాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.