హనుమాన్ చాలీసా పారాయణం

హనుమాన్ చాలీసా పారాయణం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల హమాలీ వాడలోని శ్రీ షిరిడి సాయి బాబా, హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. అష్టోత్తర శత హనుమాన్ చాలీసా లో హనుమాన్ మాలదారులు పాల్గొన్నారు. గురు స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేయగా భక్తులు కూడా సామూహిక పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.