కొండగట్టు అంజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు...

కొండగట్టు అంజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ కె. లలితలు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జడ్జి లు స్వామివారితో పాటు, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ టoకసాల వెంకటేష్ వారిని శేష వస్త్రాలతో సత్కరించగా, అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీ ఎస్పీ ప్రకాష్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిoడేoట్ సునీల్, ఆలయ స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, మారుతి ప్రసాద్, అర్చకులు లక్ష్మణ్ స్వామి, హైకోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.