సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

ముద్ర,సూర్యాపేట:- ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీని నిరసిస్తూ రోగులు, ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు.బదిలీలో రాజకీయ జోక్యంతోనే మురళీధర్ రెడ్డి బదిలీ అంటూ ఆరోపణలు.రాజకీయ నిరుద్యోగులు వైద్య వృత్తిని కలుషితం చేయవద్దు అంటూ వేడుకోలు.

అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సేవలు అందించిన ఘనత డాక్టర్ మురళీధర్ రెడ్డి.కరోనా సమయంలో వెలకట్టలేని వైద్య సేవలు అందించిన ఘనత మురళీధర్ రెడ్డిదే.మెడికల్ కళాశాలకు భూముల సేకరణలో మురళీధర్ రెడ్డిది ప్రధాన పాత్ర.. ఆయన లేకుంటే మెడికల్ కళాశాల పూర్తయ్యేది కాదు.మా ప్రాంతం డాక్టర్ మాకే కావాలటు పెద్ద ఎత్తున ఏరియా ఆసుపత్రికి చేరుకున్న ఉద్యోగులు.