గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు

గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు అన్నారు. సోమవారం హజీపూర్ మండలంలో కోటి పది లక్షల రూపాయల వ్యయంతో పలు గ్రామాల్లో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆరెస్ ప్రభుత్వం గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ప్రజల మౌళికసదుపాయల కల్పనకు కట్టుబడి ఉందని అన్నారు. రహదారులు, మురికి కాలువల నిర్మాణంకు నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో  యువ నాయకుడు నడిపెళ్లి విజిత్ రావు, జడ్పిటీసీ శ్రీనివాస్ రావు, ఎంపిపి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పాల్గొన్నారు.